ABN -ANDHRA JYOTHI

ABN Andhrajyothy Live TV

Thursday, March 25, 2010

2.0.0 కొల్లాపూర్ ప్రాంత సంక్షిప్త పరిచయం

2.1.0 కొల్లాపూర్ చరిత్ర : కొల్లాపూర్ తాలుకాకు పూర్వనామం జటప్రోలు సీమ. ఇది
కొల్లాపూర్ కు కొంత దూరంలోని ప్రాంతం. జటప్రోలు కృష్ణాతీర గ్రామం. ఇక్కడగల కోట,
ఆలయం శ్రీశైలం జలాశయంలో గురి అయినాయి. అంతకుముందే మదనగోపాల
స్వామి ఆలయాన్ని కృష్ణానది ఒడ్డున పునర్ నిర్మించి ప్రతిష్ఠించారు. కొల్లాపూర్ చరిత్రను
పరిశీలిస్తే క్రీ.శ.1840 వరకు ఇది రాజధాని కాదు. 'కొలుముల పల్లె' అనే సామాన్య గ్రామం.
పూర్వం ఇక్కడ కంచరి [కమ్మరి]కొలుములు నడిపేవారు . కనుక 'కొలుముల పల్లె' గా మారి నేడు
కొల్లాపూరంగా వాసికెక్కింది. గతంలో కొల్లాపూర్ రాజధాని ఎల్లూరు. ఎల్లూరు నుంచి రాజధాని
నగరాన్ని రాజ వెంకట లక్ష్మారావు హయాంలో కొల్లాపూర్ కు మార్చి దానిని అభివృద్ధి చేశారు

ఎల్లూరు కృష్ణాతీరంలోని అగస్తేశ్వరం, సోమేశ్వరం అలయాలు కట్టిన శిల్పులకు ఇచ్చిన
స్థలం. ఎల్లోజు, మల్లోజు, సోమోజు అనువారు ముగ్గురు సోదర శిల్పులు. ఎల్లూరు స్థలాన్ని
పొందిన పిమ్మట ఈ సోదరులు అక్కడ ఒక గ్రామాన్ని స్థాపించుకొని, కొంతకాలం ఈ
ప్రాంతానికి దొరలుగా చెలామణి అయినారు. వీరి రాజ్యం నేటి సింగోటం(సింగపట్టణం)
వరకు వ్యాపించింది. పెద్దవాడైన శిల్పి 'ఎల్లోజు 'పేరిట సోదర శిల్పులు ఎల్లూరును స్థాపించి,
అక్కడ పెద్దకోటను నిర్మించి దానిలో విశ్వకర్మను, సానగమహర్షిని ప్రతిష్ఠించారు. "ఓడలు
బండ్లవుతాయి - బండ్లు ఓడలవుతాయి "..... అన్నట్లుగా ఎల్లోజు వంశం వారు ఆచా రభ్రష్ఠులై తమ
గ్రామాలను సురభి వంశస్తులకు విక్రయించి వెళ్ళిపోయారు. 1


క్రీ.శ. 1840లో రాజా లక్ష్మణ రాయలు జటప్రోలు నుంచి రాజధానిని కొల్లాపూరు కు
మార్చివేశారు. నిజాం ప్రభువుచే రాజా బహద్దూర్, నిజాం నవాజ్ పంత్ బిరుదులు స్వీకరించిన
రాజా లక్ష్మీ జగన్నాథ రావు కొల్లాపూరాన్ని 1851 నుంచి 1854 వరకు పరిపాలించారు.
రాజా వెంకట జగన్నాథరావు హయాంలో కొల్లాపూరం సంస్థానం హైద్రాబాద్ రాష్ఠ్రంలో
విలీనమైంది.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కొల్లాపూర్ ప్రాంతానికి(నియోజకవర్గం) ఇంతవరకు
11 మంది శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1852 సంవత్సరంలో ఏర్పడిన కొల్లాపూర్
నియోజకవర్గానికి ప్రప్రథమంగా.... అనంత రామచంద్రారెడ్డి(పి.డి.ఎఫ్) శాసనసభ్యుడు .
ప్రస్తుత శాసన సభ్యుడైన జూపల్లి కృష్ణారావు(స్వతంత్ర అభ్యర్థి) పన్నెండవ అభ్యర్థి.

No comments:

Post a Comment