ABN -ANDHRA JYOTHI

ABN Andhrajyothy Live TV

Thursday, March 25, 2010

2.3.0జటప్రోలు సంస్థానం : కవి పండితులు

జటప్రోలు సంస్థానం ఎందరో కవులకు, సాహితీవేత్తలకు
నిలయం. ఇక్కడ ఎందరో పండితులు విశిష్ఠమైన రచనలు కావించారు. జటప్రోలు సంస్థానంలో
అయ్యవారి పల్లె , మంచాల కట్ట పండిత గ్రామాలుగా వినుతికెక్కాయి. వెల్లాల సదాశివశాస్త్రి,
అక్షతల సుబ్బశాస్త్రి, అక్షతల సింగరశాస్త్రి, వెల్లాలరాఘవ జోస్యులు, వెల్లాల శంకరశాస్త్రి,
వెంకట రామశాస్త్రి మొదలైన వారు అయ్యవారి పల్లె గ్రామ వాస్తవ్యులు. కవితార్కిక
సింహ గోవిందాచార్యులు, గోపాలచార్యులు 'మంచాల కట్ట 'గ్రామానికి చెందినవారు.

2.3.1సురభి మాధవరాయలు : మాధవరాయలు రాజు మాత్రమే కాదు స్వయంగా
పండితుడు కూడా. వీరి కాలం (క్రీ.శ. 1530 - 1600).వీరు జటప్రోలు సింహాసనాన్ని
అధిష్ఠించి పరిపాలన సాగించారు. ఇతను మల్ల భూపతి మూడవ కుమారుడు. ఈ వంశంలో
19వ తరం వాడైన మల్లానాయుని తమ్ముడు. మాధవరాయలు చంద్రికా పరిణయం అనే
ప్రౌఢ ప్రబంధాన్ని రచించాడు. ఇది రామరాజ భూషణుని వసు చరిత్రకు ధీటైన శ్లేషకావ్యంగా
ప్రసిద్ధికెక్కింది. ఇతనికి తర్క, అలంకార, సంగీత, వ్యాకరణ శాస్త్రాల్లో పాండిత్యం ఉంది.

చంద్రికా పరిణయం ఆరు ఆశ్వాసాల కావ్యం. ఇందులో నాయిక చంద్రిక, నాయకుడు
సుచంద్రుడు. ఈ కావ్యాంలో నాయిక అయిన చంద్రిక పరిణయాన్ని కథా వస్తువుగా చేసుకోవడం
చేత దీనికి 'చంద్రికా పరిణయం 'అనే పేరు వచ్చింది. చంద్రిక అంటే 'వెన్నెల ' .కనుక దీనిలో
వెన్నెల రాత్రి కథ వుంటుంది. చంద్రికకు చంద్రునితో వివాహం చేసినవాడు మాధవరాయలు.
ఈ కావ్యంలో శృంగారం ప్రధాన రసం. కావ్యారంభాన్ని శ్రీ వక్షోజధర స్ఫురద్వరి మురస్సీమన్..
అనే శార్దూల వృత్తంతో శుభ ఫలప్రదంగా సాగించడం వలన ఈ కవి సత్ సంప్రదాయ వేత్త అని చెప్పవచ్చు.

2.3.2ఎలకూచి బాల సరస్వతి : ఈ కవి సురభి మాధవరయల ఆస్థానంలో విద్వత్
కవిగా వాసికెక్కాడు. ఇతను పాకనాటి వైదిక బ్రహ్మణుడు. ఇతని తల్లిదండ్రులు లక్ష్మమ్మ,కిష్టయ్య.
14వ పేజి ********** కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు - ఒక పరిశీలన
ఈ కవి అసలు పేరు వెంకట కృష్ణరాయలు. ఇతను మాధవరాయల తండ్రి అయిన
మల్లానాయుని పేరిట భర్తృహరి సుభాషితాలను 'మల్ల భూపాలీయం ' పేరుతో ఆంధ్రీకరించాడు.
ఇతని రచనలు : రంగ కౌముది(నాటకం), చంద్రికా పరిణయం, భ్రమరగీతి,
కార్తికేయాభ్య్యుదయం(కావ్యాలు); రాఘవ యాదవ పాండవీయం(త్ర్యర్థికావ్యం)
సుభాషిత త్రిశతి , భర్తృహరి త్రిశతికి అనువాదం.

2.3.3యణయవల్లి కృష్ణమాచార్యులు : వీరు వ్యాకరణం, జ్యోతిష శాస్త్రం. సాహిత్యాల్లో
మంచి విద్వత్ కలవారు. వీరు జటప్రోలు సంస్థాన విద్వాంసులుగా ఖ్యాతినొందారు. వనపర్తి,
గద్వాల పండిత సభల్లో విజయభేరి మోగించారు. వీరి కాలం శాలివాహన శకం
(1720-1780). వీరు అష్టప్రాస రామశతకం, శ్రీకృష్ణ చంపువు, నిరోష్ఠ్య కృష్ణ శతకం,
రసఙ్ఞానానందము, జాతక చంద్రికా వ్యాఖ్య అనే కృతులు రాశారు.

2.3.4 అక్షతల సుబ్బశాస్త్రి : వీరి స్వస్థలం జటప్రోలు సంస్థానంలోని అయ్యవారి పల్లె,
వీరు కాశీ నగరంలో తర్క, వ్యాకరణ మీమాంసాది శాస్త్రాలను చదివారు. కొల్లాపూర్,
గద్వాల, వనపర్తి, ఆత్మకూరు పండిత సభలలో విజయ ఢంకా మోగించారు. వీరి ప్రసిద్ధ
భాష్యార్థ రత్నమాల, శ్రీ శంకర భగవత్పాదుల శారీరక మీమాంసకు భాష్యం రచించారు.

2.3.5 వెల్లాల సదాశివశాస్త్రి : ఈ కవి సురభి వంశంలోని 27వ తరం వాడైన సురభి
వెంకట లక్శ్మారావు ఆస్థానంలో శాస్త్ర చర్చలు సాగించారు. వీరి స్వగ్రామం అయ్యవారి పల్లె.
వీరు కాశీ నగరానికి వెళ్ళి వ్యాకరణ, తర్క, అలంకార శాస్త్రాలను చదివారు. జటప్రోలు
సంస్థాన ఆస్థాన పండితులుగా నియమితులై 80 ఎకరాల భూమిని 'ఇనాం 'గా పొందారు.
వీరు అవధానం శేషశాస్త్రి గారితో కలిసి చంద్రికా పరిణయం ప్రబంధానికి వ్యాఖ్యను
వెలువరించారు. సదాశివశాస్త్రి శా.శ 1783 దుర్మతి నామ సంవత్సరంలో జన్మించారు. వీరి
ముద్రిత రచనలు కన్యకాంబ చంపువు (సంస్కృతం); వెలుగోటి వంశ చరిత్ర, సురభి వంశ
చరిత్ర, కంఠీరవ చరిత్రం.
అముద్రితాలు : స్త్రీ ధర్మ కరదీపిక, అచ్యుత స్వామి చరిత్రం, అఖ్యాత చింతామణి, శబ్దతత్వ ప్రకాశిక .

2.3.6వనం సీతారామ శాస్త్రి : వీరు తర్క, వ్యాకరణ, ధర్మ శాస్త్రాలలో గొప్ప పండితులు.
వీరికి 'తర్కసింహ ' అనే బిరుదు వుంది. వీరి కావ్యాలు సోమవార వ్రత నిర్ణయం, దోషాభాస
నిరాసము. వీరిని రాణి రత్నామాంబ ఆదరించింది.

2.3.7కేశవ పంతుల నరసింహా శాస్త్రి : వీరు పల్లెపాడు గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు.
కొల్లాపూర్ ప్రాంత సంక్షిప్త పరిచయం *************** 15వ పేజి
వీరు వ్యాకరణ, అలంకార, తర్క శాస్త్రాల్లో పండితులు, సంస్కృతంలో బాల బ్రహ్మేశ్వర సుప్రభాతాన్నిరచించారు.
రఘు వంశము కావ్యానికి తెలుగు వ్యాఖ్యానం రాశారు.

2.3.8చెరుకుపల్లెనరసింహ సిద్దాంతి : వీరు చుక్కాయ పల్లె వాస్తవ్యులు. వీరి రచనలు :
సంగమేశ్వర శతకం, సంగ్రహ భారతం ముద్రితాలు. సింగ పట్టణ నరసింహ శతకం,
సింగపట్టణ నరసింహ విలాసం, సింగ పట్టణ నృసింహక్షేత్ర మాహాత్మ్యం అముద్రితాలు.

2.3.9 :ఓరుగంటి లక్ష్మినారాయణ :వీరు సింగపట్టణ వాస్తవ్యులు. వీరి తల్లిదండ్రులు :
రామలక్ష్మమ్మ, సీతారామయ్య గార్లు. వీరు శ్రీవత్సస గోత్రులు. "సింగపట్టణం లక్ష్మీ
నృసింగస్వామి చరిత్రం" వీరి కృతి. ఇది వచన రచన వీరిని రాణి రత్నమాంబ ఆదరించింది.

వీరేగాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కవి, పండితులు కూడా ఈ సంస్థాన
ప్రభువుల సత్కారాలు అందుకున్నారు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిగారు,
బలిజేపల్లి లక్ష్మికాంతం కవిలాంటి వారు కొల్లాపూర్ సంస్థానాన్ని సందర్శించి సురభి
వంశీయుల సత్కారాలు పొందారు.
కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు - ఒక పరిశీలన

No comments:

Post a Comment