ABN -ANDHRA JYOTHI

ABN Andhrajyothy Live TV

Thursday, March 25, 2010

2.6.0 కొల్లాపూర్ ప్రాంత ముగింపు:

2.6.0 ముగింపు :ఒకప్పుడు కొలుముల పల్లెగా పిలిచిన కొల్లాపూర్ క్రీ.శ. 1840
నుంచి సురభి వంశస్తులైన వెలమ దొరలకు రాజధానిగా స్వాతంత్ర్యం వచ్చేవరకు కొనసాగింది.
కొల్లాపూర్(జ్తప్రోలు) సంస్థానంలో పూర్వం ఎంతోమంది విద్వత్ కవులు తమ పాండిత్య
ప్రకర్షను చాటుకొన్నారు. సాహితీలోకంలో ప్రసిద్ధమైన చంద్రికా పరిణయ కర్త సురభి
మాధవరయలు కొల్లాపూర్ సంస్థానానికి చెందినవారే. కొల్లాపూర్ ప్రాంతంలోని పానగల్
ఖిల్లా, సోమశిల దేవాలయాలు, ఆంకాళమ్మ కోట, అమరగిరి, మల్లేశ్వరం, చిన్నమరూరు,
పెద్దమరూరు, కల్వకోలు సింగపట్టణం చారిత్రికంగా ప్రసిద్ధికెక్కిన ప్రాంతాలు.

No comments:

Post a Comment