ABN -ANDHRA JYOTHI

ABN Andhrajyothy Live TV

Thursday, March 25, 2010

2.5.0 కొల్లాపూర్ ప్రాంత దర్శనీయ స్థలాలు

2.5.0 దర్శనీయ స్థలాలు : కొల్లాపూర్ ప్రాంతం(నియోజకవర్గం) చారిత్రికంగా
సాంస్కృతికంగా ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రాంతం చారిత్రక కట్టడాలు, పురాతన గ్రామాలు,
దర్శనీయ స్థలాలను కలిగివుంది.

2.5.1పానగల్ ఖిల్లా : పానగల్ మండలంలో ఖిల్లా పానగల్ చారిత్రక ప్రసిద్ధిని పొందింది.
క్రీ.శ. 11వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ఈప్రాంతాన్ని పాలించిన బాదామి చాళుక్యులు
పానగల్ దుర్గాన్ని నిర్మించారు. ఈ దుర్గం సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తున ఉంది.
ఈ ఖిల్లాను గుట్టపై 5 చదరపు మైళ్ళ వైశాల్యంలో నిర్మించారు. ఈ పర్వత శ్రేణి మూడు
వైపులా విస్తరించి, గుర్రపునాడా ఆకృతిని పొంది, తూర్పు దిక్కున రెండు మొనలను కలిగిఉంది.
ఈ కోటను 60 బురుజులు, 20 అడుగుల ఎత్తున్న ప్రాకారాలతో శత్రు దుర్భేద్యంగా నిర్మించారు.

ఎత్తైన ఈ దుర్గంలో ఎన్నో గుడులు, గోపురాల్జు, బావులు, కుంటలున్నాయి. ఈ కోటపై శిథిలమైన గృహ సముదాయాలున్నాయి, ఈ కోటను ప్రధాన ద్వారమైన "ముండ్ల గవిని"
నేటికి చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం. క్రీ.శ. 1786లో నైజాం అలీఖాన్ బహద్దూర్
ఈ కోటలోని భవనంలో కొంతకాలం నివసించినట్లు ఆధారాలున్నాయి. 1800 అడుగుల
ఎత్తు కలిగిన ఈ దుర్గంలోని "రామగుండం "లో నీరు నిండుగా, స్వచ్ఛంగా వుండి చూపరులను
ఆకర్శిస్తోంది. ఇక్కడే శ్రీరాముడు సీతమ్మవారి పాదాలున్నాయి. చారిత్రక ఆధారాల్లోకి వెళితే
ఇక్కడ రెందుసార్లు యుద్దాలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా జానపదుల్లో ప్రసిద్ధమైన 'బాల
నాగమ్మకథ ' ఈ పానగల్ దుర్గానికి సంబంధం ఉందని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఈ
కోట దుర్గద్వారం సమీపంలో గండ శిలలపై శ్లోకాల సంస్కృత శాసనం ఉంది.
దీనిలో విజయనగర హరిహరరాయ, బుక్కరాయ సోదరుల ప్రశంస ఉంది. ఈ శాసనకాలం
క్రీ.శ. 1396.

పానగల్ రామగుండం సమీపంలో క్రీ.శ. 1424 నాటి సంస్కృత శాసనం ఉంది ఇంకా
పానగల్ కోటలో ప్రేమికుల ఉయాల, మక్కా మసీదు, ఫిరంగులను చూడవచ్చు. ఈ ఖిల్లా
పైభాగంలో గుప్త నిధులకోసం కొందరు ధనాశపరులు ఇందులోని ప్రతీ ప్రాంతాన్ని త్రవ్వి
వదిలేశారు అపురూపమైన దేవతా విగ్రహాలను తొలగించారు. నగర వైభవానికి నిలువుటద్దంగా
నిలిచిన పానగల్ ఖిల్లాను సంరక్షించి పునరుద్దరణ చేయకపొతే భవిష్యత్ తరాల వారికి
ఇక్కడ ఒక ఖిల్లా ఉండేదటా అని చెప్పుకోవల్సివస్తుంది. పానగల్లు మండలానికి మూడు
కిలోమీటర్ల దూరంలో బాలపీర్ల(బాలవీర్ల) దర్గా వుంది.

2.5.2సింగపట్టణం నృసింహసాగరం : కొల్లాపూర్ మండలంలోని సింగ పట్టణం
లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ పాదానికి ఎడమవైపున ఒక పెద్ద తటాకం ఉంది. ఈ
చెరువును సురభి వంశంలోని 19వ తరం వాడైన మల్లానయుని తమ్ముడు చంద్రికా పరిణయం
కర్త అయిన సురభి మాధవరాయలు త్రవ్వించారు. దీనిని నృసింహసాగరం(శ్రీవారి
సముద్రం)గా పిలుస్తున్నారు. జిల్లాలోని అతిపెద్దదైన చెరువుల్లో ఒకటిగా పేర్గాంచిన ఈ
చెరువు కట్ట పొడవు దాదాపు ఒక కిలోమీటరు. దీనిక్రింద 14 గ్రామాల్లోని 707
హెక్టార్ల భూమి(176.5 ఎకరాల భూమి) సాగవుతోంది.

సురభి వంశస్థులు స్వామి వారికి నిత్యపూజాభిషేకాలకు గాను ఈ తటాకం క్రింద 240
ఎకరాల మెట్ట, 12 ఎకరాల మాగాణి భూమిని 'ఇనాం 'గా ఇచ్చారు. దీన్ని దేవుని మాన్యంగా
వ్యవహారిస్తున్నారు. ఈ చెరువుకు సంబంధించి ఆసక్తికరమైన కథ ఒకటి ఈ ప్రాంతంలో
ప్రచారంలో ఉంది. ఈ తటాకాన్ని త్రవ్విన పనివారికి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం
ప్రకారం రూము(చెరువు తూము) నిండా ధనాన్ని ఇస్తానని రాజు వాగ్ధానం చేసి, తన
మాటను నిలబెట్టుకోలేకపోయాడట. పని పూర్తయిన తర్వాత అసంతృప్తి,, ఆగ్రహానికి లోనైనపనివారు ప్రతీ 7 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ చెరువు నింది అలుగు పారాలని
శపించారట దాని ప్రకారం ఇప్పటివరకు ఏడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ
తటాకంలోకి పూర్తిస్థాయిలొ నీరు నిండి అలుగు పారడం ఒక విచిత్రంగా చెప్పుకోవచ్చు.

No comments:

Post a Comment