ABN -ANDHRA JYOTHI

ABN Andhrajyothy Live TV

Thursday, March 25, 2010

2.2.0 కొల్లాపురం(జటప్రోలు) సంస్థానం : జటప్రోలు సంస్థానం

కొల్లాపురం(జటప్రోలు) సంస్థానం మహబూబ్ నగర్ జిల్లాలోనిది.
ఈ సంస్థానం 191 చదరపు మైళ్ళ విస్థీర్ణం కలిగి వుంది.
ఇందులో 89 గ్రామాలున్నాయి. ఈ రాజులు విజయనగర ప్రభువులకు, గోల్కొండ సుల్తానులకు,
అసఫ్ జాహి వంశస్తులకు సామంతులు. తర్వాతి కాలంలో ఈ సంస్థానం రాజా లక్ష్మణరాయల
హయాంలో కొల్లాపూరు కు మారిపోయింది ఈ సంస్థానం ఆదాయం సాలీనా రెండు లక్షలు.2
"వికలిత పంకజాత నవ విభ్రమమై, ఘన గోధ్రతాభి భూ..." అను చంపకమాలవృత్తపద్యం
చంద్రికా పరిణయం పీఠికలోని 18వ పద్యం. దీనిద్వారా చెవ్విరెడ్డి గణపతి దేవుని
దగ్గర సేనా నాయకుడిని రేచర్ల గోత్రజుడని, 36 వంశములకు ఇతనే మూల పురుషునిగా
భావించేవాడని తెలుస్తోంది. ఇతనికే భేతాళనాయకుడనే పేరుంది. నేటికి కొల్లాపురం సురభి
వంశస్తుల శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంలో ఈ భేతాళ నాయకునికి పూజలను జరిపిస్తూ,
బలులు ఇస్తున్నారు. 3

ఈ సంస్థాన ప్రభువులు సురభివారు రేచర్ల గోత్రోద్భవులైన వెలమవారు. వేంకటగిరి,
పిఠాపురం, బొబ్బిలి, కొల్లాపూర్ రాజవంశీకులకు మూల పురుషుడు చెవ్విరెడ్డి అను
నామాంతరం కలిగిన ఈ పిల్లలమర్రి భేతాళనాయుడు. ఇతని జననం క్రీ.శ. 1187. పాలనా
కాలం క్రీ.శ. 1195 నుంచి 1206 వరకు. వీరి వంశంలో 13వ తరం వాడైన మాదానాయుడు
జటప్రోలు శాఖవారికి మూల పురుషుడు 14వ తరం వాడైన మల్లానాయుడు క్రీ.శ. 1527లో
అనెగొంది రామదేవరాయల వల్ల జటప్రోలు సంస్థానాన్ని పారితోషికంగా పొందాడు.
వారి క్రింద సామంత రాజుగా ఏలుబడి సాగించాడు.

ఈ తరంలో 19వ తరం వాడైన కుమార మల్లనాయుని తమ్ముడు సురభి మాధవరాయలు
'చంద్రికా పరిణయం ' అనే ప్రౌఢ కావ్యాన్ని రాశాడు. ఇది రామరాజ భూషణుడు రచించిన
వసు చరిత్రకు సమకాలీన రచన అని క్రింది పద్యం ద్వారా తెలుస్తోంది.

ఉ|| "సురభి కులామలాబ్ధి బొడచూపిన 'మాధవరాయ ' చంద్రుడా
సరస పదార్థ రంజనము, సత్కవి హృద్యము గాగ "చంద్రికా
పరిణయమున్" రచించెనది భావ్యము; నీవసు చర్య చూడగా
బరగె నిగూఢ వృత్తి, నటు నీకును వర్తిలె మూర్తి నామమున్"

వెల్లాల సదాశివ శాస్త్రిగారు రచించిన "సురభి వారి వంశ చరిత్ర 'లో
ఉదహరించిన వృత్తపద్యమిది. దీనికర్త ఎవరో తెలియదు. 4

వెంకటగిరి సంస్థానాధీ శులకు మధ్యకాలంలో వెలుగోటి వారు అనే పేరు వచ్చినట్లే
వీరికి'సురభి 'వారు అనే పేరు వచ్చింది . చంద్రికా పరిణయం కావ్యంలో 'సురభి ' అనే పదం పరిమళార్థకము /కామధేనువులుగా అర్థపరంగా వివరించారు.
శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రిగారు 'సురభి ' అను దీర్ఘాంతం దేవతలకు కూడా భయం కలిగించునదని చెప్పారు.
ఇది భేతాళనాయని మాహాత్మ్యాన్ని సూచిస్తుంది. ఇది కాలక్రమేణా 'హ్రస్వాంతమై 'సురభిగా మారింది.
పురాణాల్లో దేవతల గోవుగా సురభిని వర్ణించారు. ఏది ఏమైనప్పటికీ సురభి అనేది ప్రాచీన నామం.
సురభి వంశస్తులు బెక్కెం ,పెంట్లవెల్లి, వెల్లూరు గ్రామాలలో కోటలు కట్టి, తటాకాలు
త్రవ్వించి, దేవాలయాలు కట్టించి, దేవతా ప్రతిష్ఠలు చేసి సుమారు 165 సంవత్సరాల
క్రితం ప్రస్తుత కొల్లాపుర్ ను రాజధానిగా చేసుకొని పరిపాలన చేసారు. వీరి వంశంలో ప్రస్తుతం
శ్రీ సురభి వెంకటకుమార కృష్ణ బాలాదిత్య లక్ష్మారావు హైద్రాబాద్ లో నివసిస్తున్నారు.
కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు - ఒక పరిశీలన

No comments:

Post a Comment